News March 30, 2024
KMM: భార్యను కాపాడబోయి భర్త మృతి
విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. కుప్పెనకుంట్లకి చెందిన వల్లవరపు రవి(43) భార్య ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో షాక్కు గురైంది. రవి ఆమెను కాపాడే క్రమంలో షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News January 26, 2025
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సేవలు: జిల్లా కలెక్టర్
ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా నూతన రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News January 26, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పథకాలు ప్రారంభం
∆} జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News January 26, 2025
4 పథకాల కోసం ఒక గ్రామం ఎంపిక : ఖమ్మం కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమలు కోసం ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 100% అర్హులైన వారికి పథకాలు అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదన్నారు.