News February 5, 2025
KMM: మంత్రి పొంగులేటి ప్రకటన.. గ్రామాల్లో సందడి

ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడుతుందని మంత్రి పొంగులేటి ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 577 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. తాజాగా ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Similar News
News February 14, 2025
రంగరాజన్పై దాడి.. తల్లాడకి చెందిన నలుగురి అరెస్ట్

హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో తల్లాడ మండలానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంజనాపురానికి చెందిన భూక్యా శ్రీను, అంకోలు శీరిష, వెంకట్రామునితండాకు చెందిన భూక్యా గోపాల్ రావు, నారయ్యబంజరకు చెందిన బానోత్ బేబీరాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 14, 2025
ఖమ్మం ప్రధాన రహదారులు.. రక్తసిక్తం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినీ మేడారం జాతర, పలు మండలాల్లో ఆలయాల మహోత్సవాలతో గురువారం ఖమ్మం జిల్లాలో జనాల తాకిడి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు పదుల సంఖ్యలో దుర్మరణం చెందారు. అలాగే పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అకాల ప్రమాదాలతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 13, 2025
BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.