News April 29, 2024

KMM: మహిళ మెడలో గొలుసు చోరీ

image

చేతిలో లగేజీతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన స్థానిక కవిరాజనగర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక 13వ వీధిలో ఓమహిళ రెండు చేతుల్లో బ్యాగులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని గొలుసు లాక్కుని పారిపోయాడు. ఘటనలో 3 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

Similar News

News November 18, 2025

సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

News November 18, 2025

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

image

పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

News November 18, 2025

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

image

పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.