News July 9, 2024

KMM: రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం: మాజీ MLA

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు చూసి బాధగా ఉందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు అన్నారు. పొద్దుటూరులో ఒక రైతు, భద్రాద్రి జిల్లా జానకిపురంలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని, రైతాంగానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు.

Similar News

News September 15, 2025

ఖమ్మం: ఐదేళ్ల పోరాటం.. నూతన సొసైటీ ఏర్పాటు

image

నేలకొండపల్లి మండలంలోని అప్పలనర్సింహాపురం మత్స్యపారిశ్రామిక సంఘం నూతనంగా ఏర్పాటైంది. గ్రామంలోని చెరువుకు సొసైటీ ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని వారు గత ఐదేళ్లుగా పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం మత్స్యశాఖను గుర్తించి, గ్రామానికి చెందిన 64 మందికి సభ్యత్వంను అందించారు. కొత్త సొసైటీ ఏర్పాటుపై ఆదివారం మత్స్యకారులు చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు.

News September 14, 2025

‘టీజీఈ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం చేయండి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు TGE హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు సమావేశం నిర్వహించారు. CM రేవంత్, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు.

News September 14, 2025

ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం ఖమ్మం SR&BGNR కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఉదయం సెషన్‌లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.