News November 28, 2024
KMM: ‘రైతు పండుగ నాటికి రైతు రుణమాఫీ పూర్తి’

సాంకేతిక కారణాలతో మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్మ ఖాతాల్లో జమ కాలేదని, దానిని మహబూబ్ నగర్లో నిర్వహించే రైతు పండుగ నాటికి క్లియర్ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ బియ్యాన్ని విదేశాల వారు కోరుకుంటున్నారని చెప్పారు.
Similar News
News November 16, 2025
KMM: మహిళా డెయిరీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా: కలెక్టర్

ఇందిరా మహిళా డెయిరీ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్షించిన ఆయన, నిబంధనలను తప్పక పాటించాలని, పశువుల యూనిట్లు అక్రమంగా అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.5వేల మంది లబ్ధిదారులకు 10 వేల పశువుల పంపిణీకి కట్టుదిట్టమైన నిర్వహణ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 15, 2025
ఖమ్మం: పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం: మంత్రి తుమ్మల

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్లో చేప పిల్లలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. నగర పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పని చేయాలన్నారు. ప్లాస్టిక్, చెత్త కారణంగా దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సహా అధికారులు పాల్గొన్నారు.
News November 15, 2025
ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.


