News May 24, 2024

KMM: రోడ్డు ప్రమాదంలో రికార్ట్ అసిస్టెంట్ దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి సత్తుపల్లిలో చోటుచేసుకుంది. JVR ప్రభుత్వ కాలేజ్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేసే ప్రసాద్(38) స్థానిక కృషి బైపాస్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ద్విచక్రవాహనంపై రాజీవ్‌నగర్ నుంచి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్‌కు ఉన్న కల్టివేటర్‌ను ఢీకొన్నాడు. పేగులు బయట పడటంతో స్థానికులు వెంటనే స్థానిక CHCకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News October 25, 2025

పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.

News October 25, 2025

సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

image

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్‌లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.

News October 25, 2025

పది విద్యార్థులు 30లోగా ఫీజు చెల్లించండి: ఇన్‌ఛార్జ్ డీఈవో

image

2026 మార్చిలో నిర్వహించే పరీక్షలకు హాజరు కానున్న పదోతరగతి, ఒకేషనల్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇన్‌ఛార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. రూ.50 పైన్‌తో నవంబరు 15, రూ.200ల ఆలస్య రుసుంతో డిసెంబరు 2, రూ.500 పైన్‌తో డిసెంబరు 15 లోగా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.