News June 12, 2024
KMM: విద్యుత్ బిల్లులు.. ఇక ఈజీ!

విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్ ) క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గడిచిన మే నెలలో ఖమ్మం సర్కిల్ పరిధిలో 1,19,678 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రూ.24.47 కోట్ల బిల్లులను ఆన్లైన్లో చెల్లించారు. ఇక భద్రాద్రి జిల్లాలో 71,865 గృహ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా రూ.13.97 కోట్లను చెల్లించారు.
Similar News
News March 15, 2025
ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
News March 15, 2025
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు.. 337 మంది గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో శనివారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 13,827 మందికి గాను 13,575 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,121 మంది విద్యార్థులకు గాను 2,036 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 337 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 15, 2025
ఖమ్మం: Way2Newsలో కథనం.. అ.కలెక్టర్ పరిశీలన

‘సాగు నీళ్లు కరవై.. పొలం బీళ్లై’ శీర్షికన Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన కథనానికి అదనపు కలెక్టర్ శ్రీజ స్పందించారు. ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాలని, తద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆమె వెంట మండల అధికారులు పాల్గొన్నారు.