News January 12, 2025

KMM: సంక్రాంతి సంబురాలు.. విషాదం కావొద్దు: CP

image

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. బావులు, చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళ్తారని, వారితో పాటు తోడుగా వెళ్లాలని నిరంతరం గమనించాలని సూచించారు. అలాగే యువతకు వాహనాలు ఇవ్వవొద్దని, ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.

Similar News

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News November 17, 2025

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పుట్టకోట మహిళలు కోరిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ఆర్డీఓ, హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ వల్లభి యువత కోరిన విధంగా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.