News April 17, 2025

KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.

Similar News

News April 19, 2025

ఖమ్మం: బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

image

బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2025

ధరణితోనే కాంగ్రెస్‌కు అధికారం: మంత్రి పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని, తొలగించి భూ భారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు.

News April 19, 2025

ఖమ్మం: ఈనెల 20న నెల నెలా వెన్నెల కార్యక్రమం

image

ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, కె.దేవేంద్ర, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాబృందం ‘హక్కు’ నాటిక ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!