News March 21, 2025
KMM: ఇందిరమ్మ ఇళ్లకు 69,536 అర్హుల గుర్తింపు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులకు ఇటీవలి బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో 37,444, భద్రాద్రి జిల్లాలో 32,092 మంది అర్హులను గుర్తించారు, లిస్ట్ ఫైనల్ చేసి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. అతి త్వరలోనే లిస్ట్ రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తుండగా, స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 16, 2025
NLG: పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సోమవారం తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
News November 16, 2025
వనపర్తి: వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు

వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం వృద్ధులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, ఫిర్యాదు చేసిన తక్షణమే తగిన న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి తెలిపారు. సోమవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.
News November 16, 2025
మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగా సంజీవరావు

పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కే.సంజీవరావు, జనరల్ సెక్రటరీగా జి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్గా డబ్ల్యూవిఎస్ఎస్ శర్మ, ట్రెజరీగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.కళ్యాణిదుర్గ ఎన్నికయ్యారు.


