News July 13, 2024
KMM: నిధులు లేక పడకేసిన పంచాయితీ పాలన

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు నిధుల లేమితో తలడిల్లుతున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. నిధుల కొరతతో పల్లెల బాగోగులు ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Similar News
News February 24, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎస్

ఖమ్మం జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
News February 24, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎస్

ఖమ్మం జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
News February 24, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.


