News April 15, 2025
KMM: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల పటిష్ట అమలుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ తెలిపారు. ఖమ్మంకు జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు ఎస్డీసీ రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి ఎల్.రాజేంద్ర గౌడ్ ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 16, 2025
2,019 మందికి రూ 20.19 కోట్లు జమ: పొంగులేటి

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.20.19 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి రూ.లక్ష చొప్పున విడుదల చేసినట్లు ప్రకటించారు.
News April 16, 2025
రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు.. కులాల వారీగా..!

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకానికి 91,850 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీజ తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 29,091, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 14,220, బీసీ కార్పొరేషన్ ద్వారా 41,881, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 6,658 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన ధరఖాస్తులన్నిటిని ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు.
News April 16, 2025
ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.