News August 28, 2025

KMM: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నందున అటువైపు వెళ్లవద్దని, రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

Similar News

News August 28, 2025

పగిడేరు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించిన సీపీ

image

కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయమైన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు.

News August 28, 2025

ఖమ్మం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 1077 లేదా 9063211298 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

News August 28, 2025

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కార్యాచరణ: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన PM ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. గిరిజన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.79,156 కోట్లతో ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లోని 35 గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. గిరిజనులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు.