News May 13, 2024
KMM: ‘ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చు’
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయోచ్చని పేర్కొన్నారు.
Similar News
News October 2, 2024
రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12706/12705) భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం ఎక్స్ప్రెస్ చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక ప్రజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News October 2, 2024
ఖమ్మం: నేడు గాంధీ జయంతి.. ఈ దుకాణాలు బంద్
నేడు గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చికెన్, మటన్, ఫిష్, వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు బెల్టు షాపులు, మరోవైపు మాంసం దుకాణాలు దొంగచాటుగా మద్యం, మాంసాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి.