News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News November 30, 2025
ఎన్నికలు.. ప్రజావాణి తాత్కాలిక రద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున, కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి నిలిపివేయబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించి, సహకరించాలని ఆయన సూచించారు.
News November 30, 2025
ఖమ్మం BRSలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతం

ఖమ్మం BRSలో అంతర్గత వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నిన్నటి ‘దీక్షా దివస్’లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ MLAలు ఎవరికి వారుగా వ్యవహరించారు. మొదట తాతా మధు, సండ్ర, కందాల అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించగా, తరువాత భారీ బైక్ ర్యాలీతో పువ్వాడ బల ప్రదర్శన చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయ వేడుకల్లోనూ ఎవరికి వారే అన్నట్లు ఉండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
News November 30, 2025
బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా మహిపాల్ రెడ్డి

బీజేపీ జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జుల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా బద్ధం మహిపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఖమ్మానికి చెందిన కొండపల్లి శ్రీధర్ రెడ్డిని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్గా, సన్నె ఉదయ్ ప్రతాప్ను నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.


