News March 12, 2025

KMM: BRS రూ.7లక్షల కోట్లు దోచుకుంది: పొంగులేటి

image

ధనిక రాష్ట్రాన్ని BRS పదేళ్లు పాలించి రూ.7లక్షల కోట్లు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని, గతంలో చేయలేని ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఆర్థిక లోటు ఉన్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించారు.

Similar News

News October 14, 2025

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలి: కలెక్టర్

image

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు.

News October 14, 2025

తల్లాడ: ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 13, 2025

‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.