News March 17, 2024

KMM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు.

Similar News

News April 2, 2025

కోర్టు సినిమా హీరోను అభినందించిన ఎమ్మెల్యే

image

భద్రాచలం విచ్చేసిన కోర్టు మూవీ హీరో రోషన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి కోర్టు మూవీ ద్వారా పెద్ద హిట్ కొట్టినందుకు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం పట్టణాన్ని పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.

News April 2, 2025

ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా నాణ్యత తనిఖీ చేయాలని పేర్కొన్నారు.

News April 2, 2025

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల

image

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.21,000కు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ధర రూ. 8,500 మేర పెరిగిందని మంత్రి తెలిపారు. ధర పెరగడంతో రాష్ట్రంలోని 64,582 మంది ఆయిల్ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని, ఇంకా మరింతమంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!