News March 17, 2024
KMM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు.
Similar News
News January 31, 2026
ఖమ్మంలో 5 మున్సిపాలిటీలకు 923 నామినేషన్లు

జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 117వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో శుక్రవారం వరకు 923 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎదులాపురం (32)లో 241, సత్తుపల్లి (23)లో 154 దాఖలయ్యాయి. వైరా (20) 190, మధిర (22) 178, కల్లూరు (20) 159నామినేషన్లను 779 మంది అభ్యర్ధులు వేశారు. 60 మంది ఇండిపెండెంట్లు కాగా కాంగ్రెస్ 374, BRS 251, BJP 110, ఇతరులు 61, CPM 47, TDP 13, BSP, YCPకి 1 చొప్పున నామినేషన్లు వేశారు.
News January 30, 2026
ఖమ్మం: మహిళ టీ20 క్రికెట్ టోర్నిని ప్రారంభించిన ఎంపీ

ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఐదో జాతీయ సీనియర్ మహిళా టీ20 క్రికెట్ టోర్నీని శుక్రవారం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రారంభించారు. క్రికెట్ టోర్నీకి తరలివచ్చిన వివిధ రాష్ట్ర క్రికెటర్లకు పౌష్టికారంతో కూడిన కొన్ని స్నాక్స్, కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడరంగ అభివృద్ధికి ఎంతోకృషి చేస్తుందన్నారు.
News January 30, 2026
కల్లూరు: స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 11న 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్ట్రాంగ్ రూములను బ్యాలెట్ బాక్స్లను స్టేట్ ఎన్నికల అబ్జర్వర్ పవన్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.


