News June 7, 2024
KMM-NLG-WGL: గెలుపు కోసం 1,55,095 ఓట్లు..!

రెండు రోజులుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. KMM-NLG-WGL ఉపఎన్నిక కౌంటింగ్లో ఎవరికి గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, BRS అభ్యర్థి రాకేశ్రెడ్డికి 1,04,246 ఓట్లు, BJP అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
Similar News
News October 19, 2025
ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.
News October 19, 2025
ఖమ్మం: సీట్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 5 నుంచి 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5లోగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ కళాశాలలో సంప్రదించాలన్నారు.
News October 18, 2025
డిప్యూటీ సీఎం భట్టి రేపటి పర్యటన వివరాలు

బోనకల్ మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారుల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.