News September 10, 2024
KMM: అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ
ఖమ్మం జిల్లాలో SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు దరఖాస్తు ముగిసింది. ఇంటర్వ్యూకి తేదీలు ప్రకటించారు. 11న జరగనున్న ఇంగ్లిష్-1,హిస్టరీ-3,ఎకనామిక్స్-1 గణితం-3, బోటనీ-1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్-3,BCA-1,డేటా సైన్స్-1,బయో టెక్నాలజీ-1,12తేదీన జరగనున్న ఇంటర్వ్యూ కామర్స్-2, పొలిటికల్ సైన్స్-2,BBA-2 ఓ ప్రకటనలో ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు.
Similar News
News October 6, 2024
ఖమ్మం: వెదురు కోసం వెళ్లి గుండెపోటుతో మృతి
గుండెపోటులో వ్యక్తి చనిపోయిన ఘటన తల్లాడ మండలం జగన్నాథపురంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లికార్జునరావు (50) శనివారం ఉదయం వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లాడు. గుండెనొప్పి వస్తోందని మధ్యాహ్నం తనతో ఉన్నవారికి చెప్పాడు. వారు మల్లికార్జునరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
News October 6, 2024
దేశానికి రోల్ మోడల్గా కొత్త చట్టం: మంత్రి
ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అలా తాము చేయబోమన్నారు.
News October 6, 2024
దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: మంత్రి
ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అటువంటివి తాము చేయమన్నారు.