News October 13, 2024

KMM: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ మృతి

image

గంజాయి కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ భూక్యసాగర్ నాయక్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలీస్ అధికారుల పేర్లు చెబుతూ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు.

Similar News

News October 14, 2024

ఖమ్మం: ఇవాళ, రేపు మంత్రి తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 14న రఘునాధపాలెం మండలం రజబ్ ఆలీ నగర్, ఎన్వి బంజార, పంగిడి గ్రామాలలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 15న ఖమ్మం నగరంతో పాటు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయి గూడెంలో పర్యటించనున్నట్లు తెలిపారు.

News October 14, 2024

‘సాయిబాబా మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి’

image

ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం పార్టీ నాయకులు అబ్దుల్ నబి అన్నారు. ఆదివారం సీపీఎం పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ సాయిబాబా సంతాప సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాపై అనేక అక్రమ కేసులను బనాయించి జైలులో నిర్బంధించారని అన్నారు. సాయిబాబా మరణం ప్రజాస్వామ్య వాదులకు తీరని లోటు అని అన్నారు.

News October 13, 2024

ఎర్రుపాలెం: వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

ఎర్రుపాలెం మండల కేంద్రంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.