News January 12, 2025
KMM: సంక్రాంతి సంబురాలు.. విషాదం కావొద్దు: CP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736597372059_11885857-normal-WIFI.webp)
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. బావులు, చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళ్తారని, వారితో పాటు తోడుగా వెళ్లాలని నిరంతరం గమనించాలని సూచించారు. అలాగే యువతకు వాహనాలు ఇవ్వవొద్దని, ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.
Similar News
News February 5, 2025
KMM: మంత్రి పొంగులేటి ప్రకటన.. గ్రామాల్లో సందడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738732120346_11885857-normal-WIFI.webp)
ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడుతుందని మంత్రి పొంగులేటి ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 577 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. తాజాగా ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
News February 5, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738716988387_11885857-normal-WIFI.webp)
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కారేపల్లి రైల్వే గేట్ మూసివేత
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News February 5, 2025
ఖమ్మంలో రూ.116 కోట్ల ధాన్యం కొనుగోళ్లు: కొత్వాల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738722403640_691-normal-WIFI.webp)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో DCMS ద్వారా 2024-25 వానాకాలంలో 4.13 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యానికి రూ.116.49 కోట్లు చెల్లించామని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్, DCMS ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 94 వేల క్వింటాళ్లకు గాను రూ.26.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3.19 లక్షల క్వింటాళ్లకు గాను సుమారు రూ.90 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.