News February 8, 2025

KMR: అంతర్జాతీయ ప్రశంసా పత్రం అందుకున్న వైద్యాధికారిణి

image

భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగిన 8 అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్‌లో కాలేయ వ్యాధులకు సంబంధించి రీసెర్చ్ స్టడీ పైన ప్రొఫెసర్ డాక్టర్ అస్మిత వేలే డైరెక్టర్ రిసెర్చ్ డీపీయూ పూణే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ చైతన్య రమావత్ అందుకున్నారు. కాలేయ వ్యాధులకు సంబంధించి పరిశోధన చేయడం తనకు ఆనందంగా ఉందని చైతన్య రమావత్ తెలిపారు.

Similar News

News February 8, 2025

మనీశ్ సిసోడియా ఓటమి

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.

News February 8, 2025

VKB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

News February 8, 2025

వెలువడుతున్న ఫలితాలు.. బీజేపీ 4, ఆప్ 1

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లీడింగ్‌లో కొనసాగిన BJP, AAP విజయాలు నమోదు చేస్తున్నాయి. BJP 4 చోట్ల విజయం సాధించగా AAP ఒకచోట గెలుపొందింది. మరో 42స్థానాల్లో కమలదళం, 23చోట్ల ‘చీపురు’ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆప్ 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా వెనుక పడిపోవడంతో ఆధిక్యం 23కు తగ్గింది. అగ్రనేతలే ఆ పార్టీకి భారం కావడం గమనార్హం.

error: Content is protected !!