News August 1, 2024
KMR: అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. పంచలోహ విగ్రహం స్వాధీనం

కామారెడ్డిలో అంతర్ జిల్లా దొంగను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకుని పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దొంగను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన చిల్లా గంగాదాసుగా పేర్కొన్నారు. అతడు మాక్లూర్ మండలం మాదాపూర్కు చెందిన దర్పల్లి సాయిలు, నిర్మల్ జిల్లాకు చెందిన కోసడిగి మోహన్లతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు.
Similar News
News January 24, 2026
NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్ను పరామర్శించిన కలెక్టర్

నిజామాబాద్ శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
News January 24, 2026
NZB: 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 158 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.14,50,000 జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని CP వివరించారు.
News January 24, 2026
NZB: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం పరిశీలించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయో గమనించి సంబంధిత సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా నగరంలో 3 డివిజన్లకు ఒకటి చొప్పున 20 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


