News March 19, 2025
KMR: అందరికీ ఆమోదయోగ్య బడ్జెట్: షబ్బీర్ అలీ

TG అసెంబ్లీలో డీప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఈ ఆమోద యోగ్యమైనదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణాభివృద్ధితో పాటు పల్లెల అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. అలాగే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
బండి సంజయ్పై కేసు కొట్టివేత

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
News March 20, 2025
‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవాలని కోరారు.
News March 20, 2025
హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్

పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్లో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. వెంకటేష్ నిత్యం తాగి వచ్చి తల్లి లక్ష్మమ్మ, భార్య సబితను వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఈనెల 19న తల్లి, భార్య ఇద్దరు కలిసి ఐరన్ రాడ్తో అతడి చెవి భాగాన కొట్టి చంపారు. నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.