News January 4, 2025

KMR: అదనపు కట్నం కోసం హత్య.. భర్తకు జీవిత ఖైదు

image

అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త రమావత్ రమేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పునిచ్చారు. జిల్లాలోని సురాయిపల్లి తండాకు చెందిన రమేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 ఫిబ్రవరి 27న లింగంపేట్ బస్టాండ్‌లో కొట్టాడు. గాయపడినా ఆమె నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు విధించారు.

Similar News

News January 22, 2025

దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి: NZB కలెక్టర్

image

గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ప్రత్యేకించి అద్దె ఇంట్లో ఉన్నామని వచ్చే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.

News January 22, 2025

నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లాలో తూంపల్లి 11.1, జాకోరా 11.9, చందూర్ 12.0, నిజామాబాద్ సౌత్, కోటగిరి 12.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

News January 22, 2025

NZB: అడవిపంది దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

image

అడవిపంది దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ఎడ్దూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పంట చేలల్లో మంగళవారం గొర్రెలు మేపుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన శివ సాయిపై అడవిపంది దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.