News May 1, 2024
KMR: అధికారుల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ క్రాంతి అధ్యక్షతన సంగారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ సింధూ శర్మ పాల్గొన్నారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 1, 2024
నీట్ పరీక్షల్లో కామారెడ్డి విద్యార్థుల ప్రతిభ
ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన చెప్యాల సునైనరెడ్డి రాష్ట్ర స్థాయిలో 272వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మరొక విద్యార్థిని సంజన రాష్ట్ర స్థాయిలో 4,148వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పలువురు అభినందించారు.
News October 1, 2024
అక్టోబర్ 8-10 వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జల శక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను అధికారులు పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News September 30, 2024
కామారెడ్డి జిల్లా టాపర్గా పిట్లం యువతి
సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.