News March 23, 2025
KMR: అప్పులు తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్య

సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన సుంకరి శంకర్(51) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు చేసి తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. శంకర్ బిచ్కుంద మండలం నీరడిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
HYD: రాబోయే రోజుల్లో చెమట సుక్కలే..!

ఏటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్ల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.
News November 13, 2025
గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్ అబ్దుల్ సాద్ ఊనైస్

గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్గా అబ్దుల్ సాద్ ఊనైస్ ఎంపికయ్యాడు. అబ్దుల్ సాద్ ఊనైస్ బాపట్ల వాసి. రేపు శుక్రవారం నుంచి సెంట్రల్ జోన్ అండర్-14 జోన్ మ్యాచ్లు జరగనున్నాయి. చిన్న వయసు నుంచే క్రికెట్లో సత్తా చాటుతున్న అబ్దుల్ సాద్ గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల పలువురు క్రికెట్, క్రీడా ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 13, 2025
HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.


