News January 22, 2025
KMR: అప్రమత్తతే ఆయుధం: SP

మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్ కేర్, ఇతర గృహోపకరణాలు మార్కెటింగ్ పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ మోసాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుకోకుండా ఒక వేళ ఆ వలలో చిక్కితే వెంటనే 1930 కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 7, 2025
గుడ్లను ఇలా ఉడికిస్తున్నారా?

గుడ్డులో పోషకాలు, రంగు, రుచి ప్రత్యేకంగా ఉండాలంటే ఓ పద్ధతి ప్రకారం ఉడికించాలని US శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డు సరిగ్గా ఉడకాలంటే ముందుగా మరుగుతున్న నీటిలో నుంచి గోరు వెచ్చని నీటిలోకి.. అలాగే గోరు వెచ్చని నీటిలో నుంచి మరుగుతున్న నీటిలోకి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మార్చాలి. ఇలా 32 నిమిషాలపాటు చేయాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ఉంచి పెంకు తీయాలి. ఇలా చేస్తే గుడ్డులోని పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి.
News February 7, 2025
కాలేజీలో నాపై ఎంతోమందికి క్రష్: రష్మిక

కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ఆ తర్వాత దేశం మొత్తానికి క్రష్గా మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కిరిక్ పార్టీ(కన్నడ) సినిమా తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చింది. ఈ ట్యాగ్ దేశం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక కాలి గాయంతో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.
News February 7, 2025
ఆదాయం ప్రకటించిన ఎల్ఐసీ

LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.