News January 22, 2025

KMR: అర్హత కలిగిన వారికి ఉపకరణాలు అందించాలి: కలెక్టర్

image

కామారెడ్డి KVR గార్డెన్‌లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు మంగళవారం ప్రత్యేక నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి 572 మంది దివ్యంగులు హాజరయ్యారు. కాగా ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. అర్హత కలిగిన వారికి ఉపకరణాలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం ‘భేటీ బచావో భేటీ పడావో’ ప్రారంభమై పదేళ్లయిన సందర్భంగా కలెక్టర్ సంతకం చేసి పోస్టర్లను ఆవిష్కరించారు.

Similar News

News November 26, 2025

GWL: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పరస్పర సహకారంతో అధికారులు పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.

News November 26, 2025

రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

image

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.