News March 19, 2025
KMR: అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: SP

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశీలించి ఫైనల్ చేయాలన్నారు. అన్ని రకాల ఫిర్యాదులపై చట్ట ప్రకారం స్పందించాలన్నారు. కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నేరాల నియంత్రణ చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 20, 2025
గేట్ ఫలితాల్లో యువతి సత్తా

శ్రీకాకుళం క్యాంపస్ (ఎచ్చెర్ల) త్రిబుల్ ఐటీ చదువుతున్న విద్యార్థినీ గేట్-2025లో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులు కొమరాల శ్వేత శ్రీ, 241, అప్పన్న శ్రీనివాస్ 663 ర్యాంక్లు వచ్చాయని డైరక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. విద్యార్థినిని బాలాజీ గురువారం అభినందించారు.
News March 20, 2025
60ఏళ్లు గడిచినా రైళ్ల వేగంలో మార్పేది?.. నెట్టింట విమర్శలు

పొరుగు దేశాలు అక్కడి రైళ్ల వేగాన్ని రెట్టింపు చేస్తే ఇండియా మాత్రం ఇంకా 120-130KMPH వేగం వద్దే ఆగిపోయిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీనికోసం 1969లో మొదలైన రాజధాని EXPను ఉదహరిస్తున్నారు. ఇది 55ఏళ్ల క్రితమే 120KMPH వేగంతో నడిచే రైలుగా పరిచయమైందంటున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు 130KMPHతో అందుబాటులోకి వచ్చిందని, ఆరు దశాబ్దాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?
News March 20, 2025
కండక్టర్పై దాడి.. రాజంపేట సీఐ వార్నింగ్

ఈనెల 16వ తేదీన నందలూరు బస్టాండ్లో కండక్టర్పై దాడి విషయంలో ఇరు వర్గాల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజంపేట రూరల్ సీఐ కుళ్లాయప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికురాలితో కండక్టర్ ప్రవర్తించిన తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం చెంది దాడి చేశారని, ప్రయాణికులు కండక్టర్తో ఆ మహిళకు సారీ చెప్పించడంతో సమస్య అక్కడే పరిష్కారం అయిందన్నారు. కలహాలు సృష్టించే విధంగా ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.