News February 4, 2025
KMR: ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇవాళ ప్రజావాణికి 80 ఫిర్యాదులు అందాయని తెలిపారు. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, సదరం సర్టిఫికెట్, తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News January 4, 2026
విజయవాడలో IAS భార్య అనుమానాస్పద మృతి

విజయవాడలో IAS అధికారి భార్య అనుమానా స్పదస్థితిలో మృతి చెందింది. గతనెల 31న ఆమెను కరెన్సీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్యగా పటమట పోలీసులు గుర్తించారు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News January 4, 2026
ఖమ్మం: సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్లు

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఖమ్మం నగరానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
News January 4, 2026
‘భోగా’పురం మంటలు

AP: భోగాపురం ఎయిర్పోర్టు <<18758900>>వైభోగానికి<<>> తామే కారణమంటూ టీడీపీ, వైసీపీ ప్రకటనలు చేస్తున్నాయి. తమ పాలనలో వేగంగా అనుమతులు తీసుకురావడం వల్లే ఈ మైలురాయి చేరుకున్నామని జగన్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్టును అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్దేనని, ఇలా చెప్పుకోవడానికి వైసీపీకి సిగ్గుండాలని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. మోదీ-CBN వల్లే నిర్మాణం పూర్తయిందని కౌంటర్ ఇచ్చారు.


