News January 21, 2025
KMR: ఆ భూములకు రైతు భరోసా: కలెక్టర్

సాగుకు యోగ్యం ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. దోమకొండ మండలం లింగుపల్లిలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి లేని పేదలు జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24లో కనీసం 20 రోజులైనా పని చేసిన వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందవచ్చని తెలిపారు. న్యూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
UCO బ్యాంక్లో 532 పోస్టులు

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO) 532 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.uco.bank.in/
✍️ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 23, 2025
మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.
News October 23, 2025
కోహ్లీ గెస్చర్ దేనికి సంకేతం?

AUSతో రెండో వన్డేలో డకౌటై వెళ్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఫ్యాన్స్కు కోహ్లీ చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పారు. అయితే దీనిపై SMలో చర్చ జరుగుతోంది. రన్ మెషీన్ అడిలైడ్లో చివరి మ్యాచ్ ఆడేశారని, అందుకే ఫ్యాన్స్కు కృతజ్ఞతలు తెలిపారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటు సిరీస్ తర్వాత రిటైర్ కానున్నారని, అదే హింట్ ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డేలోనూ కోహ్లీ ‘0’కే ఔటయ్యారు.