News January 21, 2025
KMR: ఆ భూములకు రైతు భరోసా: కలెక్టర్

సాగుకు యోగ్యం ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. దోమకొండ మండలం లింగుపల్లిలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి లేని పేదలు జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24లో కనీసం 20 రోజులైనా పని చేసిన వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందవచ్చని తెలిపారు. న్యూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
వరంగల్: 24 అంతస్తులకు 24 ఏళ్లు కావాలా..?

WGLలో రూ.1200 కోట్లతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం 2021లో శంకుస్థాపన చేసింది. 2 ఏళ్లలో పూర్తిచేసి 12అంతస్తుల్లో 35వైద్య విభాగాల్లో OP, IP సేవల కోసం 2208 పడకలను, 500 మంది వైద్యులు, 1000 మంది స్టాఫ్ నర్సులు, మరో 1000 మంది పారా మెడికల్ వైద్య సిబ్బంది సేవలు అందించేలా నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్లో పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పట్లో పనులు పూర్తయ్యేలా లేవు.
News November 8, 2025
మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్పూర్లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News November 8, 2025
పెందుర్తి: అత్తను చంపి ఫైర్ యాక్సిడెంట్గా కథ అల్లిన కోడలు

పెందుర్తి పీఎస్ పరిధిలో కనకమహాలక్ష్మి అనే మహిళ అగ్ని ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. దేవుడి గదిలో దీపం పడి మంటలు చెలరేగడంతో తన అత్త చనిపోయినట్లు కోడలు లలితా దేవి పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా.. పాత గొడవలతో కోడలే అత్తను చంపి ప్రమాదంలో చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసినట్లు తేలిందని సీఐ సతీష్ కుమార్ శనివారం తెలిపారు.


