News January 21, 2025

KMR: ఆ భూములకు రైతు భరోసా: కలెక్టర్

image

సాగుకు యోగ్యం ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. దోమకొండ మండలం లింగుపల్లిలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి లేని పేదలు జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24లో కనీసం 20 రోజులైనా పని చేసిన వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందవచ్చని తెలిపారు. న్యూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

image

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్‌ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.

News November 18, 2025

ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

image

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్‌ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.

News November 18, 2025

‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

image

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.