News February 28, 2025

KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్‌ బృందాలను నియమించారు.

Similar News

News December 2, 2025

తిరిగి విధుల్లోకి ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రకాశ్‌

image

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్‌ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News December 2, 2025

ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

image

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.

News December 2, 2025

నంద్యాల: హత్య కేసులో నలుగురి అరెస్ట్

image

నంద్యాలలో మేదరి పుల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడి ఆస్తులు, డబ్బులు కాజేయాలని కుట్ర పన్ని ధనుంజయ అనే వ్యక్తి సహచరులతో కలిసి పుల్లయ్యను హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి, ఇంట్లో నుంచి DVRలు, ల్యాప్టాప్‌లను దొంగిలించారని చెప్పారు. ఈ కేసులో ధనుంజయ్, సంతోష్, రాఘవ, శ్రీకాంత్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.