News February 28, 2025

KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్‌ బృందాలను నియమించారు.

Similar News

News March 15, 2025

వరంగల్: బ్యాంక్ సిబ్బంది వేధింపులు.. సోదరుల ఆత్మహత్యాయత్నం

image

వరంగల్ పట్టణ పరిధిలో దారుణం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక పట్టణంలోని చిలుకూరి క్లాత్ స్టోర్ సోదరులు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2025

వరంగల్: బ్యాంక్ సిబ్బంది వేధింపులు.. సోదరుల ఆత్మహత్యాయత్నం

image

వరంగల్ పట్టణ పరిధిలో దారుణం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక పట్టణంలోని చిలుకూరి క్లాత్ స్టోర్ సోదరులు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2025

ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

image

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.

error: Content is protected !!