News March 17, 2025

KMR: ఇంటర్ పరీక్షల్లో 411 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్రం, అర్ధశాస్త్రం పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 8217 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7964 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2086 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 158 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

Similar News

News November 22, 2025

Al Falah: వందల మంది విద్యార్థుల భవిష్యత్తేంటి?

image

ఢిల్లీ పేలుడు <<18325633>>ఉగ్ర మూలాలు<<>> అల్ ఫలాహ్ వర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వందల మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వర్సిటీ, కాలేజీల గుర్తింపులు రద్దయితే అంతా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కెరీర్, NEET కష్టం, ₹లక్షల ఫీజులు వృథా అవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఎక్కడా నమ్మరని బాధపడుతున్నారు.

News November 22, 2025

నిర్మల్: మండలాలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ

image

జిల్లాలోని పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 18 ఫాగింగ్ యంత్రాలను మండలానికి ఒకటి చొప్పున ఎంపీఓలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అందించారు. ఫాగింగ్ యంత్రాలను సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. దోమలను సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.

News November 22, 2025

సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

image

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్‌లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్‌‌లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?