News February 7, 2025
KMR: ఈనెల 10న జిల్లా స్థాయి ట్రయథ్లాన్ సెలక్షన్స్
కామారెడ్డి జిల్లా స్థాయి యూత్ ట్రయథ్లాన్ సెలక్షన్స్ ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. అండర్ 20, 18, 16, 14 విభాగాల్లో.. వివిధ అంశాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్తో జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు
కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
News February 7, 2025
రేపటి లోగా బుమ్రా ఫిట్నెస్పై రిపోర్ట్!
భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్నెస్పై ఫ్యాన్స్లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్నెస్పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News February 7, 2025
BCల జనాభా పెరిగింది: రేవంత్
TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని CM చెప్పారు.