News March 7, 2025

KMR: ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. MRO జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ తదితరులు ఉన్నారు.

Similar News

News December 1, 2025

నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్‌ల నామినేషన్ల ఆమోదం

image

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. ​అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.

News December 1, 2025

KNR: ‘సారీ సర్.. మేం ఒప్పుకోం.. నిలుస్తాం, గెలుస్తాం’

image

మొదటి విడత గ్రామపంచాయతీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. ఆయా పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు 5- 10 వరకు నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో నామినేషన్ ఉపసంహరణకు నేతలు ప్రయత్నిస్తుంటే ‘సారీ మేము ఒప్పుకోం.. బరిలో నిలుస్తాం, గెలుస్తాం’ అని పోటీదారులు చెబుతుండడంతో నేతలు అవాక్కవుతున్నారు. ఉపసంహరణకు ఎల్లుండి లాస్ట్ డేట్ కావడంతో బుజ్జగింపుల ప్రక్రియను ముమ్మరం చేశారు.

News December 1, 2025

తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

image

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.