News March 7, 2025

KMR: ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. MRO జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ తదితరులు ఉన్నారు.

Similar News

News October 22, 2025

బలి చక్రవర్తి ఎవరంటే?

image

బలి చక్రవర్తి రాక్షస వంశంలో జన్మించినప్పటికీ, అపార దాన గుణంతో, పరాక్రమంతో ముల్లోకాలను పరిపాలించాడు. ఈయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్త ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు. ఆయన దాతృత్వాన్ని, అహంకారాన్ని పరీక్షించడానికి విష్ణువు వామనావతారంలో వచ్చాడు. మూడడుగుల నేలను దానంగా అడిగాడు. బలి తన సర్వస్వం దానం చేశాడు. ఈ దాన గుణాన్ని మెచ్చిన హరి పాతాళ లోకానికి బలిని చక్రవర్తిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు.

News October 22, 2025

సిద్దిపేట: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్‌ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగ్గా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్‌ను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్‌తో పాటు అతడి స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.

News October 22, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

image

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.