News March 7, 2025
KMR: ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని EVM గోడౌన్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. MRO జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ తదితరులు ఉన్నారు.
Similar News
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
News November 18, 2025
హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్

దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. అతడిపై కేంద్ర రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.


