News March 22, 2025
KMR: ఈ నెల 31 వరకు దరఖాస్తులక అవకాశం

ప్రధాని మంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దేశంలోని 500 పైచిలుకు కంపెనీల్లో ఇంటర్న్లుగా చేరి పని అనుభవాన్ని గడిచే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 23, 2026
కల్తీ నెయ్యి అంశంపై అసెంబ్లీలో చర్చ?

AP: రాష్ట్రంలో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఓ రోజు ఈ అంశంపై చర్చ జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అసెంబ్లీ తర్వాత మండలిలోనూ చర్చ పెట్టాలని భావిస్తోందట. ఈ అంశంపై అధికారికంగా తన వైఖరిని వెల్లడించడంతో పాటు అవసరమైన చర్యలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
News February 23, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ పాల్వంచ: మనస్థాపనతో మహిళ ఆత్మహత్య
✓ దమ్మపేట: రూ.130 లక్షల నగదు, బంగారం లూటీ
✓ భద్రాచలం: గోదావరి వద్ద వైభవంగా నదీ హారతి
✓ పాల్వంచ ఆసుపత్రుల్లో డీఎంహెచ్వో తనిఖీలు
✓ రేపు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ భద్రాద్రిలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్వో
✓ ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లందు ఎమ్మెల్యే
News February 23, 2026
BREAKING: భారత్ ఘోర ఓటమి

T20WC సూపర్-8లో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్య సేన 111 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ 0, అభిషేక్ 15, తిలక్ 1, సూర్య 18, సుందర్ 11, దూబే 42, హార్దిక్ 18, రింకూ 0 పరుగులు చేశారు. SA బౌలర్లలో కేశవ్ 3, మార్కో 4, బోష్ 2, మార్క్రమ్ ఒక వికెట్ తీశారు. ఈ ఓటమితో మిగిలిన రెండు మ్యాచ్లనూ భారత్ తప్పక గెలవాల్సిందే.


