News January 27, 2025
KMR: ఉత్తమ సేవలకు ప్రశంసా పతకాలు

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 43 మందికి ప్రశంసా పత్రాలు, 10 మందికి అతి ఉత్కృష్ట సేవా పతకాలు, మరో ఉత్కృష్ట సేవా, పోలీసు పతకాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధూ శర్మ, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి అందజేశారు.
Similar News
News February 25, 2026
జీపీఆర్ఎస్తోనే భూముల కచ్చితమైన కొలతలు: కలెక్టర్

ఆసిఫాబాద్: అత్యాధునిక జీపీఆర్ఎస్ సాంకేతికతతో భూముల కొలతలు శాస్త్రీయంగా నిర్వహించవచ్చని కలెక్టర్ కె. హరిత తెలిపారు. దానాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఈ గ్రామంలో 1923 సర్వే చట్టం ప్రకారం పక్కాగా సర్వే చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియతో రైతులకు స్పష్టమైన హక్కులు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 25, 2026
కరీంనగర్: 400 మంది విద్యార్థులు గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 15,389 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 14,989 మంది మాత్రమే పరీక్ష రాశారని జిల్లా విద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, గైర్హాజరు మినహా పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని తెలిపారు.
News February 25, 2026
కరీంనగర్: పారదర్శకంగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం ప్రారంభమైన మొదటి సంవత్సరం పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నిఘా, వసతులను పరిశీలించి, మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


