News January 22, 2025
KMR: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం FEB 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కోటేశ్వర్లు తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటార్ రవాణ, సహకార సంస్థలు, ఇతర ట్రస్ట్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు, కార్మికులకు ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తారని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు మేడే నాటికి ఉపకార వేతనాలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
Similar News
News February 10, 2025
రేషన్ కార్డులు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి

అర్హులైన ప్రతిఒక్కరు నూతన రేషన్ కార్డులకు, పెన్షన్లకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతొక్కరు ఆయాగ్రామల్లో సచివాలయల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి స్వామి తెలిపారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.
News February 10, 2025
బ్యాటింగ్ ఎంజాయ్ చేశా.. సెంచరీపై రోహిత్ కామెంట్

ఇంగ్లండ్తో రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు కోసం నిలబడటం సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని చెప్పారు. బ్యాటింగ్కు దిగినప్పుడే వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన బాడీని లక్ష్యంగా చేసుకొని వేసిన బంతులపై సరైన ప్రణాళికలు అమలు చేశానని పేర్కొన్నారు. ఇక గిల్ చాలా క్లాసీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చారు.
News February 10, 2025
నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.