News March 29, 2025

KMR: ఉపకార వేతన దరఖాస్తు గడువు పెంపు

image

2024-25 విద్యా సంవత్సరానికి తాజా, రెన్యువల్ ఉపకార వేతనాలకు దరఖాస్తులకు గడువును మే 31 వరకు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారిని రజిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News November 27, 2025

ములుగు: పంచాయతీ పోరులో తాజా ‘మాజీ’లు

image

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా మాజీ సర్పంచులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో గతంలో కాంగ్రెస్ మద్ధతు దారులుగా గెలుపొందిన వారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సర్పంచులుగా గెలిచి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు. రిజర్వేషన్ కలిసి రానిచోట ఆత్మీయులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

News November 27, 2025

ASF: అండర్ – 14 బాక్సింగ్‌కి 8 మంది విద్యార్థుల ఎంపిక

image

ఆసిఫాబాద్ జిల్లాలో అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాక్సింగ్ సెలక్షన్స్ నిర్వహించి జోనల్ స్థాయికి 8 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. షేక్ అబ్దుల్ అజాం, విక్రం తేజ, వివేక్, ప్రేమ్ రక్షిత్, అశ్విత్ తేజ, సిద్దు, చక్రపాణి, వినయ్ ఎంపికయ్యారు. విద్యార్థులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.

News November 27, 2025

విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

image

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్‌లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.