News June 11, 2024
KMR: ఉరేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పిట్లంలో జరిగింది. మండలానికి చెందిన ప్రవీణ్ సాఫ్ట్ వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇంటి వద్దే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.
Similar News
News January 8, 2026
హరియాణాలో కామారెడ్డి వాసి దారుణ హత్య

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కటికే రజనీకాంత్ (40) హరియాణాలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హరియాణాకు వెళ్లారు.
News January 8, 2026
NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.
News January 8, 2026
NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.


