News January 31, 2025

KMR: ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

image

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బాదల్ గావ్ శివారులో ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మత్లి తండాకు చెందిన చౌహాన్(40) కుటుంబంతో కలిసి చెరకు నరికే పనులకు వెళ్లాడు. చెరకు తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఎడ్ల బండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 22, 2025

TU: పీజీ ఇంటిగ్రేటెడ్ రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోండి..!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఇంటిగ్రేటెడ్( అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్) 2,4 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు తమ ఫలితాలపై రివాల్యుయేషన్ చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ తెలిపారు. ఈ మేరకు నిన్న సర్కులర్ జారీ చేశారు. ఈనెల 29లోపు రూ.500 రుసుము చెల్లించి పరీక్షల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.

News November 22, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన అధికారుల సంఘం ఎన్నిక

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అంజిత్ రావు, విక్రమ్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విలాస్ తెలిపారు. అసోసియేట్ అధ్యక్షుడిగా గంగాధర్, ఉపాధ్యక్షుడిగా భాస్కర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మల్లేశ్, జాయింట్ సెక్రెటరీగా వెంకటేశ్, ట్రెజరర్‌గా ప్రమోద్, చైతన్య, ఈసీ మెంబర్లుగా దిలీప్, తేజస్విని, మధుసూదన్ రావు, శరత్ ఎన్నికయ్యారన్నారు.