News February 3, 2025

KMR: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందికి సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను అదనపు కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికల నియమావళి మేరకు గదులను ఏర్పాటు చేయాలని, CC కెమెరాలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News December 7, 2025

గాలివీడు: 42 ఏళ్ల తర్వాత కలిశారు.!

image

గాలివీడు మండల జడ్పీ హైస్కూల్ 1982–83 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం SK కళ్యాణ మండపంలో నిర్వహించారు. పాత మిత్రులు ఒకచోట చేరి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి కలయిక ఎంతో ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. దాదాపు 42 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పాఠశాల జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

News December 7, 2025

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

image

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.

News December 7, 2025

బ్రహ్మసముద్రం: అన్నదమ్ముల మృతిపై అప్‌డేట్..!

image

బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురంలోని నీటి సంపులో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గానికి చెందిన అన్నదమ్ములు నరేంద్ర (32), చరణ్ (25)పాల వెంకటాపురంలోని మామిడి తోటలోని సంపు వద్దకు వెళ్లారు. చరణ్ కాలుజారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న సంపులో దూకాడు. ఇద్దరికి ఈతరాకపోవడంతో ఊపిరాడిక మృతి చెందారు.