News February 3, 2025

KMR: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందికి సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను అదనపు కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికల నియమావళి మేరకు గదులను ఏర్పాటు చేయాలని, CC కెమెరాలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News November 28, 2025

శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

image

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.

News November 28, 2025

NLG: దేశంలోనే అతిపెద్ద భూస్కామ్ ఇదే: మాజీ మంత్రి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీదైన భూములను ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినోళ్లకు కట్టబెడుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ మన తెలంగాణలో జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలసీల పేరుతో భారీగా స్కామ్‌లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

News November 28, 2025

HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

image

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.