News January 17, 2025
KMR: ఎన్నికల సామాగ్రికి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ శుక్రవారం తెలిపారు. టెండర్ దరఖాస్తు ఫాంలు ఈ నెల 18 నుంచి 24 వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా పంచాయతీ అధికారి నంబర్ 7306245710కు సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 20, 2025
జనవరి నెలాఖరులోగా విశాఖకు TCS!

AP: ప్రముఖ IT సంస్థ TCS ఈ జనవరి నెలాఖరులోగా విశాఖలో ఏర్పాటు కానుంది. తొలుత 2 వేల మందితో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆపరేషన్స్ ప్రారంభించిన రోజే శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 చివరి నాటికి శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. TCS క్యాంపస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ ఐటీ పార్కులోని హిల్-3పై ఎకరానికి 99 పైసల చొప్పున 21.6 ఎకరాలను కేటాయించింది.
News December 20, 2025
దైవమే పాటించిన ధర్మం

శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోడానికి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. లోక నాయకుడైనప్పటికీ భూలోక నియమాలు పాటించి, పత్రం రాసిచ్చి, కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని మాటిచ్చారు. నేటికీ భక్తుల కానుకల రూపంలో ఆ రుణాన్ని తీరుస్తున్నారు. మనం ఎంత గొప్పవారమైనా సమాజ నియమాలను గౌరవించాలని, తీసుకున్న అప్పును బాధ్యతగా తిరిగి చెల్లించాలని, కష్టకాలంలో సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలని తెలుపుతుంది.
News December 20, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 142 సొసైటీలు

తెలంగాణ వ్యాప్తంగా కో ఆపరేటివ్ బ్యాంకులు <<18617893>>సొసైటీల పాలకవర్గాలు రద్దు<<>> కావడంతో గ్రామాల్లో నాయకులు, రైతు ప్రతినిధులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. సర్పంచ్గా ఓడిన వారు పోటీ చేయని సీనియర్ నేతలు అప్పుడే రంగంలోకి దిగి లాబీయింగ్ ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ పాలకవర్గం నామినేట్ కానుంది. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 53, మొత్తం 142 సొసైటీలకు కొత్త అధ్యక్షులు రానున్నారు.


