News January 17, 2025

KMR: ఎన్నికల సామాగ్రికి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ శుక్రవారం తెలిపారు. టెండర్ దరఖాస్తు ఫాంలు ఈ నెల 18 నుంచి 24 వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా పంచాయతీ అధికారి నంబర్ 7306245710కు సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 18, 2025

ఏలూరు: వృద్ధురాలిపై దాడి.. బంగారు గొలుసు చోరీ

image

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎం. వెంకమ్మ (70)పై ఓదుండగుడు దాడి చేసి, మెడలో ఉన్న రెండున్నర కాసుల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. తిమ్మాపురం నుంచి ఆమె లక్కవరంలో కూతురు మహాలక్ష్మి ఇంటికి వచ్చింది. కూతురు, అల్లుడు బుధవారం పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. గాయపడిన వెంకమ్మను స్థానికులు లక్కవరం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 18, 2025

వరంగల్ జిల్లాలో సింగిల్ డిజిట్లో గెలిచిన అభ్యర్థులు!

image

నర్సంపేట మండలం జీజీఆర్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి భూస నరసయ్య ఒక్క ఓటు తేడాతో గెలిచారు. 453 ఓట్లకు గాను 421 పోలై నరసయ్యకు 191, BRS అభ్యర్థి కుమారస్వామికి 190 ఓట్లు వచ్చాయి. ఖానాపురం మండలం అయోధ్యనగర్‌లో BRS అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెక్కొండ మండలం మడిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష, అజ్మీరా మంగ్యానాయక్ తండాలో BRSఅభ్యర్థి మాలోత్ వెంకట్ స్వల్ప మెజార్టీతో గెలిచారు.

News December 18, 2025

వచ్చే 4 రోజులు మరింత చలి

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 21 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా దామరంచలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.