News February 12, 2025
KMR: ఎల్లారెడ్డి ఘటనపై స్పందిచిన ఎమ్మెల్సీ కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364023055_1269-normal-WIFI.webp)
కాంగ్రెస్ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 13, 2025
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364715103_51771152-normal-WIFI.webp)
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ROలు నోటిఫికేషన్ జారీ చేసిన రోజే నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుందన్నారు.
News February 13, 2025
కాగజ్నగర్: యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్ట్: CI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739381394237_20574997-normal-WIFI.webp)
కాగజ్నగర్ పట్టణంలోని ద్వారకా నగర్కు చెందిన అక్రంపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ విచారణ చేపట్టారు. పట్టణంలోని తైబానగర్ కాలనీకి చెందిన ఫారూక్, రాజిక్, సాదిక్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.. అనంతరం వీరిని సిర్పూర్ JFCM కోర్టులో రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు.
News February 13, 2025
ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364663871_20397864-normal-WIFI.webp)
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లా అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్తో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.