News April 2, 2025

KMR: ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు: డీఈఓ రాజు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించినట్టు జిల్లా డీఈఓ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. (సమ్మేటివ్ -2) వార్షిక పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులకు పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. అనంతరం 12:30కి మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంటుందని తెలిపారు.

Similar News

News December 15, 2025

ఎయిమ్స్ కల్యాణిలో 172 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్<<>> కల్యాణిలో 172 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/

News December 15, 2025

2 రోజులు స్కూళ్లకు సెలవు

image

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి. 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లకు రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. అలాగే ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది.

News December 15, 2025

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 25,915 వద్ద, సెన్సెక్స్ 398 పాయింట్లు కోల్పోయి 84,869 వద్ద కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ITC, రిలయన్స్, టైటాన్, TechM, ఇన్ఫీ, SBI, మారుతి, యాక్సిస్ బ్యాంక్, TCS, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, BEL, L&T షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.