News January 30, 2025
KMR: ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు!

KMR జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారం ఎత్తుతున్నారు. అభాగ్యులను లంచాల రూపంలో దోచుకుంటున్నారు. నవంబర్ 14 న స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రైటర్ తోట రామస్వామితో పాటు SI అరుణ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా SI సుధాకర్ పట్టుబడ్డారు. జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు SIలు, ఓ రైటర్ ఏసీబీకి చిక్కారు. వారిద్దరూ ఒకే స్టేషన్కు చెందినవారు కావడం విశేషం.
Similar News
News December 2, 2025
ఆదిలాబాద్: పెంపుడు శునకానికి పురుడు

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి పటేల్, నాగమ్మ దంపతులు ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 12న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాల్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామాకారనోత్సవం చేశారు. అనంతరం శునకానికి నైవేద్యం సమర్పించారు.
News December 2, 2025
యాదాద్రి : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నామినేషన్

కనిపించని దేవుడి కన్నా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని పెద్దలంటుంటారు. ఇక ప్రతి బిడ్డ విజయం వెనుక వారు ఉంటారు. అయితే ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల తరుణంలో యాదాద్రి జిల్లా రామన్నపేట(మం) ఇంద్రపాలనగరానికి చెందిన గర్దాస్ విక్రమ్.. BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దానికి ముందు ఆయన వారి అమ్మనాన్నలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అతడిని పలువురు అభినందిస్తున్నారు.
News December 2, 2025
రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుందాం..!

యాదాద్రి(D) రాజాపేట(M) రేణికుంట గ్రామ పంచాయతీకి గతంలో రాష్ట్ర ఉత్తమ అవార్డు లభించింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందిన తమ గ్రామానికి హరితహారం, స్వచ్ఛభారత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు కూడా లభించిందని మాజీ సర్పంచ్ భాగ్యమ్మ తెలిపారు. స్వయం సమృద్ధి విభాగంలో 2021-22లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బెస్ట్గా నిలిచిన ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


