News March 6, 2025

KMR: ఒకే రోజు నలుగురు మృతి.. జర జాగ్రత్త..!

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం ఒక్క రోజు వివిధ గ్రామాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో అంజవ్వ, డొంకేశ్వర్ మండలం అన్నారంలో చిన్నారెడ్డి, ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో శ్రీనివాస్, రామారెడ్డిలో మానస మరణించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News November 25, 2025

అర్హులందరికీ పక్కా ఇల్లు.. దరఖాస్తు చేసుకోండి: VZM కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి ఇల్లు లేని నిరుపేదల కోసం 100% డిమాండ్ సర్వే జరుగుతోందని తెలిపారు. అర్హులంతా నవంబర్ 30లోపు ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా సచివాలయం సిబ్బంది సహాయంతో నమోదు చేసుకోవాలన్నారు.

News November 25, 2025

BJP నన్ను రాజకీయంగా ఓడించలేదు: మమత

image

బీజేపీ రాజకీయంగా పోరాడి తనను ఓడించలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఈసీ నిష్పాక్షిక సంస్థ కాదని, ‘BJP కమిషన్‌’గా మారిపోయిందని ఆరోపించారు. బొంగావ్‌లో యాంటీ SIR ర్యాలీలో ఆమె మాట్లాడారు. బిహార్‌లో NDA ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఇంత తొందరగా SIR నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓట్ల జాబితా నిజమైనది కాకపోతే, 2024లో బీజేపీ గెలుపు కూడా నిజమైనది కాదని ఆరోపించారు.

News November 25, 2025

సిరిసిల్ల: కలెక్టర్ హరిత సెలవుల పొడిగింపు

image

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత తన లాంగ్ లీవ్‌ను పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన ఆమె ఈనెల 24న విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఇక సిరిసిల్లకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
.