News April 2, 2025
KMR: కలెక్టరేట్లో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి

కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజ స్థాపన చేసిన మహనీయుడని కొనియాడారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.
News November 8, 2025
సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ఓగా వేణుగోపాల్

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ఓగా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న జయ మనోహరి పదోన్నతిపై వెళ్లడంతో, ఆ స్థానంలో డా.వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
News November 8, 2025
శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


